యువకుడు స్వయంగా కాలు నరికేసుకున్న ఘటన

యువకుడు స్వయంగా కాలు నరికేసుకున్న ఘటన

అన్నమయ్య: మదనపల్లె మాదినకొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక శ్రీరాములు (35) అనే యువకుడు మద్యం సేవించి అడవిలో తన ఎడమ కాలును కొడవలితో నరికేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.