మంగళగిరి సమస్యలపై లోకేష్ హామీ
GNTR: మంగళగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ నేతలు మంత్రి లోకేశ్కు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా రేవేంద్రపాడు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, రైల్వే ఫ్లైఓవర్లు, పేదలకు ఇళ్ల స్థలాల సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, మిగిలిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.