రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

అన్నమయ్య: చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భూపాల్ (24) అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న టమోటా లారీని ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు చిత్తూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.