రైల్వేస్టేషన్లో పెచ్చులూడిపడి బాలుడికి గాయాలు

AP: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లో పెచ్చులూడిపడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడో నెంబర్ ప్లాట్ఫాం వద్ద పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. రామేశ్వరం వెళ్లేందుకు కుటుంబంతో స్టేషన్కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.