ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిరమాసం శుక్రవారం పాడ్యమి తిథి సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి అభిషేకం చేసి విశేష పూజలు చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.