హెల్మెట్ వినియోగంపై వాహనదాలకు అవగాహన
NTR: మైలవరంలో హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హైవే రోడ్డుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి సీఐ కే. కిషోర్ బాబు, ఎస్సై సుధాకర్ హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. కొంతమందికి ఐఎస్సై ప్రమాణం గల హెల్మెట్లు ఉచితంగా అందించారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.