ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది: ఎమ్మెల్యే
BHPL: మండలం కొంపల్లి, గుడాడ్పల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని కోరారు.