పెదగుమ్ములూరు నూకాంబిక ఆలయ ఉత్సవం
AKP: ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో పునర్నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగించి, మహిళలు కలశాలతో భక్తిశ్రద్ధతో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్ రాజు, గ్రామ పెద్దలు నవీన్ రాజు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.