ప్రతి ఇంటి గేట్కు 'ఫుట్బాల్' కట్టిన సర్పంచ్ అభ్యర్థి!
SDPT: ఈనెల 14న జరగనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, పుల్లూరులో చిటుకుల శృతి ప్రసాద్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు. తనకు కేటాయించిన 'ఫుట్బాల్' గుర్తును ఓటర్లు మర్చిపోకుండా ఉండేందుకు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి ఇంటి గేటుకు ఫుట్బాల్ గుర్తును పోలిన కాగితంతో చేసిన ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు.