నేడే టైటిల్ పోరు: భారత్ Vs దక్షిణాఫ్రికా
భారత మహిళల జట్టు ఈరోజు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టైటిల్ కోసం జరిగే ఈ కీలక పోరు నవీ ముంబై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ గెలవాలనే ఆశతో ఉన్న భారత్, తొలిసారి ఫైనల్ చేరిన సఫారీ జట్టు మధ్య ఈ ఉత్కంఠ పోరు జరగనుంది. భారత్ కప్పు గెలవాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.