సీతంపేట ఐటీడీఏ గ్రీవెన్స్లో 24 వినతులు
PPM: సీతంపేట ఐటీడిఏ కార్యాలయంలో APO చినబాబు ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్లో ఐటీడీఏ పరిధిలో పలు సమస్యలు తెలుపుతూ 24 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన వినతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్య పరిష్కరానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులుకి APO సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సిబ్బంది ఉన్నారు.