VIDEO: నైట్ ఫుడ్ కోర్ట్ పునరుద్ధరణకు డిమాండ్
విశాఖలో సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్ట్ను పునఃస్థాపించాలంటూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మంగళవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మద్దతు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని, ఫుడ్ కోర్ట్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, కమిషనర్లను కలిసి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నరు.