చెక్కు బౌన్సు కేసులో ఆరునెలల జైలు

చెక్కు బౌన్సు కేసులో ఆరునెలల జైలు

TPT: ఏడు చెక్కు బౌన్సు కేసుల్లో బెంగళూరుకు చెందిన డా. సోమసుందర్‌ రెడ్డికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిప్ కోర్టు న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. డా. బి.చంద్రపాణి వద్ద రూ.31.37 లక్షలు అప్పు తీసుకుని జారీ చేసిన ఏడు చెక్కులు బౌన్సు కావడంతో కేసులు నమోదయ్యాయి.