ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్
BDK: అశ్వాపురం మండల పరిధిలో మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో సుమారు 25 లక్షలతో నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం సర్పంచ్ నరసింహారావు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. గత కొన్నిళ్ళుగా బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సమస్య తెలిపిన వెంటనే ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారని తెలిపారు.