అధ్వానంగా మారిన గోదావరి నది స్నాన ఘట్టాలు

అధ్వానంగా మారిన గోదావరి నది స్నాన ఘట్టాలు

MNCL: మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది స్నాన ఘట్టాలు అస్తవ్యస్తంగా మారాయి. దేవదాయ శాఖ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఘట్టాలపై పాకురు పేరుకుపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు జారిపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఘట్టాలను శుభ్రం చేయించాలని కోరారు.