సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
SKLM: వీరఘట్టం MPDO వెంకటరమణ మండలంలోని 56 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతీ శుక్రవారం ఇంటింటికీ వెళ్లి 'వాట్సాప్-మన మిత్ర' క్యాంపెయిన్ నిర్వహించడంలో విఫలమైనందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చామని ఎంపీడీవో పేర్కొన్నారు. దీనీపై ఉద్యోగులు స్పందిస్తు.. సర్వర్ సమస్యల వల్ల యాప్లో వివరాలు నమోదు చేయలేకపోయామని తెలిపారు.