నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి
ADB: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారని కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు. మధ్యాహ్నం 2:15 గంటలకు బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి చేరుకుని CM రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయానికి చేరుకుని CM సభ ఏర్పాట్లను పరిశీలిస్తారు.