ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
అమరావతి: ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఫీజును తాత్కాల్ కింద ఈ నెల 10 వరకు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అవకాశం కల్పించింది. రూ.3 వేల అపరాధ రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.