హంద్రీనీవా కాలువలో ఈత నిషేధం: ఎస్సై

హంద్రీనీవా కాలువలో ఈత నిషేధం: ఎస్సై

సత్యసాయి: హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి ఇటీవల ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో సోమందేపల్లి ఎస్సై సుధాకర్ యాదవ్ గురువారం హెచ్చరికలు జారీ చేశారు. ఎండాకాలంలో పిల్లలు, యువత కాలువలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు. కాలువల్లో ఈత పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.