వాడపల్లి స్వామివారి నిత్యాన్నదాన పథకానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి ఆదివారం కాతేరు వాస్తవ్యులు వెంకటేష్, శ్రీమతి ప్రణవి రూ. 50,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.