'6 గ్యారంటీలు అమలు చేయాలి'

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ వర్గల్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు రూ.4,000 పింఛన్, మహిళలకు రూ.2,500 భృతి ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.