వేరుశనగ రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏడీఏ
KDP: కమలాపురం పరిధి దాదిరెడ్డిపల్లిలో వేరుశనగ పంటలను ADA నరసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. పంటకు పొగాకు లద్దె పురుగు, ఆకు ముడత ఆశిస్తున్నట్లు గుర్తించారు. నివారణకు పారాజైడ్ లేదా వయగోతో పాటు 13-0-45 ఎరువును కలిపి పిచికారీ చేయాలన్నారు. మువ్వకుళ్లు తెగులుకు దోమల మందు వాడాలన్నారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని, APAIMS యాప్ సేవలు వినియోగించుకోవాలన్నారు.