ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గొడౌన్‌‌ను నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. తొలుత గొడౌన్‌ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులను ఆయన పరిశీలించారు.