అన్నవరం దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం
KKD: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలను శుక్రవారం జారీ చేసింది. ఈ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా ఇనుగంటి వెంకట రోహిత్ను నియమించారు. అలాగే, 16 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.