రాజస్థాన్లోని జైసల్మేర్ లో పాక్ దాడి

రాజస్థాన్లోని జైసల్మేర్లోనూ పాక్ ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. ఈ క్రమంలో అమృత్సర్, బికనేర్, జలంధర్లో విద్యుత్ నిలిపివేశారు. పాకిస్తాన్ సరిహద్దు జిల్లాలలోని ప్రాంతాల్లో సైరన్లను మోగిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. జమ్మూవ్యాప్తంగా ఇంటర్నెట్ను ఆఫ్ చేశారు.