గవర్నర్ అబ్దుల్ నజీర్కు సాదర వీడ్కోలు
TPT: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్కు శనివారం రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలసి వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా ఇతర అధికారులు కూడా హాజరై గవర్నర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.