ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలి: నిర్మల రెడ్డి
SRD: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.