నేడు కలెక్టరేట్ను ముట్టడించనున్న అరటి రైతులు
ATP: మాజీమంత్రి, శింగనమల వైసీపీ నేత శైలజానాథ్ నేతృత్వంలో ఇవాళ అరటి రైతులు కలెక్టరేట్ ను ముట్టడించనున్నారు. అనంతరం శైలజానాథ్ కలెక్టర్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు భారీ ఎత్తున పాల్గొనాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.