'నిరుపేదల ఆరోగ్యానికి సంజీవనిలా CMRF'
E.G: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి CMRF ఒక సంజీవనిలా మారుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండలం తీపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు రూ. 54,45,187 విలువైన CMRF చెక్కులు & LOC పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.