అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో మండలాల వారీగా సాధించిన ప్రగతిని ఆయన పరిశీలించారు.