'షర్మిల పర్యటనను విజయవంతం చేయాలి'
NDL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈనెల 18న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిరివెళ్ల మండలంలో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యంపై ఆమె ప్రజలకు వివరిస్తారని సోమవారం నియోజకవర్గ ఇంఛార్జి హుస్సేన్ బాషా, నేత శంషుల్ హక్ తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు.