'సమస్యలపై వచ్చిన అర్జీలు త్వరగా పరిష్కరించండి'
NDL: ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.