డిసెంబర్ 14 నుంచి జాతర ఉత్సవాలు
SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు డిసెంబర్ 14 నుంచి 2026 మార్చి 16 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ తెలిపారు. డిసెంబర్ 14న దృష్టి కుంభం, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 15న లక్ష బిల్వార్చన, జనవరి 18న మొదటి ఆదివారం, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, పెద్దపట్నం ఉంటుందని వివరించారు.