'మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తాం'
SRCL: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తామని జిల్లా సర్కిల్ సూపరిండెంటెంట్ బిక్షపతి అన్నారు. తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో నూతన విద్యుత్ ఉపకేంద్రం నిర్మించడానికి బుధవారం స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా రామన్నపల్లి, బద్దెనపల్లి, బస్వాపూర్, అంకుసాపూర్, రామాజీపేటకు మెరుగైన విద్యుత్ అందుతుందన్నారు.