భారత్తో చివరి 2 మ్యాచులకు హెడ్ దూరం
భారత్తో 5 టీ20ల సిరీసులో భాగంగా జరగాల్సిన చివరి 2 మ్యాచులకు ట్రావిస్ హెడ్ దూరమయ్యాడు. నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ కోసం అతణ్ని ఆస్ట్రేలియా బోర్డ్ జట్టు నుంచి తప్పించింది. ఇది భారత్కు ఓ రకంగా శుభసూచికమే. కాగా యాషెస్ కోసమే జోష్ హేజిల్వుడ్ కూడా చివరి 3 మ్యాచులకు దూరమైన సంగతి తెలిసిందే.