బస్టాండ్‌లో బంగారు గొలుసు మాయం.. కేసు నమోదు

బస్టాండ్‌లో బంగారు గొలుసు మాయం.. కేసు నమోదు

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం రాత్రి బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళా ప్రయాణికురాలి మూడు తులాల బంగారు గొలుసు మాయమైంది. గౌతమి గుత్తి నుండి గుంతకల్‌కు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.