నిత్యాన్నదానానికి భారీ విరాళం
NGKL: శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వరరావు, అనిత దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిత్యాన్నదానానికి విరాళంగా రూ.11,11,600 ఇవాళ అందజేశారు. వారికి గణపతి పూజ ఉమాదేవి కుంకుమార్చన, అభిషేక కార్యక్రమంలో నిర్వహించి అర్చకులతో ఆశీర్వాదం చేయించి ప్రసాదాలను అందజేశారు.