పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: ప్రతి ఒక్క పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తెలిపారు. మంగళవారం రణస్థలం మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిని తిరిగి కొనసాగిస్తుందని ఆయన వివరించారు.