జాతర ఏర్పాట్లు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే
సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అధికారులను తెలిపారు. రాబోయే సమ్మక్క సారక్క జాతర దృష్ట్యా బుధవారం దేవస్థానం అధికారులతో కలిసి ఆయన ఉచిత, కోడె, రూ.100 క్యూలైన్లు, రూ.300 క్యూలైన్, కళ్యాణ కట్ట సహా అన్ని రద్దీ ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు.