ఈ నెల 17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది
HYD: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది. ఈ నెల 17-22 వరకు HYDలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో, 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. 21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమై, అనంతరం తేనీటి విందులో పాల్గొంటారు. తిరిగి 22న ఉదయం ఢిల్లీకి బయలుదేరతారు.