సమస్యల పరిష్కారానికి జనవాణి
AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఎలమంచిలి పీఆర్ అతిథి గృహంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.