నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: కంభం పట్టణంలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఆల్ఫా స్కూల్ న్యూ క్యాంపస్, యశస్విని హాస్పిటల్, ఏవి ఫంక్షన్ హాల్, మనన్ ఫంక్షన్ హాల్ వంటి ప్రాంతాల్లో ఇన్ లైన్ పోల్స్, ఎర్త్ దిమ్మెలు, నూతన ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ అంతరాయం కలుగుతుందని ఏఈ వెంకట నరసయ్య తెలిపారు. వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.