VIDEO: 'హరిపాటవం, హనుమాన్ చాలీసా పుస్తకాల వితరణ'
ADB: బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామంలోని రామాలయంలో ఆధ్యాత్మికవేత్త గురుదాస్ శంకరయ్య ఆధ్వర్యంలో హరిపాటవం, హనుమాన్ చాలీసా పుస్తకాలను ఆదివారం పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడంతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఇప్పటివరకు 100 పైగా గ్రామాల్లో పర్యటించి 12 వేల పుస్తకాలను పంపిణీ చేసినట్లు శంకరయ్య పేర్కొన్నారు.