VIDEO: వర్షంలోనూ కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం కురుస్తున్న వర్షంలోనూ పత్తి కొనుగోళ్లు చురుకుగా కొనసాగుతోంది. రహదారులు తడిగా మారినా, రైతులు ప్రైవేట్ వాహనాల ద్వారా పత్తిని మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈరోజు పత్తి క్వింటాల్ ధర రూ. 6930గా పలుకుతోంది. ఆశించిన ధర రాలేదంటూ కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.