ఉత్తమ అధికారిణిగా ప్రశంస పత్రం అందుకున్న రాధా బాయ్

SRCL: వేములవాడ ఆర్డీవో రాధాబాయి ఉత్తమ అధికారిణిగా ప్రశంస పత్రం అందుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఈ ప్రశంస పత్రాలను అందజేశారు. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితేలు ఈ పత్రాలను అందించారు. ఆర్డీవో రాధాబాయిని పలువురు అభినందించారు.