పిఠాపురంలో ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం

పిఠాపురంలో ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం

KKD: పిఠాపురం నియోజకవర్గంలో మార్చి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఫిబ్రవరి 28 శనివారం నుంచే పింఛన్లు అందజేస్తున్నారు. గ్రామాలు, వార్డుల్లో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు సకాలంలో పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.