కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

NZB: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ లక్షకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉండడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు.