'రహదారుల్లో గుంతలు పూడ్చివేతకు టెండర్లు ఖరారు'
E.G: 3వ ఫేజ్లో రాజమండ్రిలోని ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చివేతకు టెండర్లు ఖరారైనట్టు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అవసరమైన చోట పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించాలన్నారు.