ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి
PDPL: NTPC నుంచి GDK వెళ్తున్న ఓ ఆటోను శారద నగర్ రాజీవ్ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున వెనుక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలోని ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్ మృతదేహాన్ని, గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.