పోలీస్ స్టేషన్ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు..!
SRD: సదాశివపేట మండలం మద్దికుంట గ్రామానికి చెందిన తండా వాసులు ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులు కేసు విషయంలో రాజీ పడాలని సూచించినప్పటికీ, వారు వినకుండా బయటకు వచ్చి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు వారిని ఆపలేకపోయారు. ఈ విషయంపై పోలీసులను అడగగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు కాలేదని తెలిపారు.